బెంగళూరులో సిలిండర్ పేలి..ముగ్గురు మృతి..కూలిన నాలుగు ఇళ్లు..శిధిలాల కింద 50 మంది

- October 16, 2017 , by Maagulf
బెంగళూరులో సిలిండర్ పేలి..ముగ్గురు మృతి..కూలిన నాలుగు ఇళ్లు..శిధిలాల కింద 50 మంది

బెంగళూరులో సిలిండర్ పేలుడు ప్రకంపనలు సృష్టించింది. ఎజ్జిపుర ప్రాంతంలో భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. ఆ ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అందులో ఉన్న వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే బెంగళూరు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.

భారీ శబ్దంలో పేలుడు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వైపు పేలుడు.. మరోవైపు వెంటనే భవనాలు కూలిన శబ్దం రావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. చుట్టుపక్కల వారు పరుగున వచ్చి. వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో శిథిలాల కింద నుంచి హాహాకారాలు వినిపించాయి. వెంటనే స్థానికులు మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సిలిండర్ పేలుడు ఇంత భయంకరంగా ఉంటుందని అక్కడి వారు ఊహించలేకపోతున్నారు. శిథిలాల కింద కనీసం మరో 50 మంది ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. వారందరినీ బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com