భాగ్యనగరం లోని దీపావళి సంబరాల్లో 30 మందికి ప్రమాదం..

- October 19, 2017 , by Maagulf
భాగ్యనగరం లోని దీపావళి సంబరాల్లో 30 మందికి ప్రమాదం..

తెలంగాణ లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అయితే అక్కడక్కడా కొన్ని అపశ్రుతులు జరిగాయి. వేడుకల్లో ప్రమాదాలు సంభవించి పలువురు గాయపడ్డారు. 
బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, మీడియా ఎంతో ప్రచారం చేశాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోలేదు. ఫలితంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 25 మంది సరోజినీ దేవి ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు  15 మందికి చికిత్స చేసి పంపించగా.. మరో 10 మందిని ఇన్‌ పేషెంట్‌ గా చేర్చుకున్నారు. క్షతగాత్రుల్లో 18 స్వప్న కంటికి తీవ్రగాయమైందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com