ఒడిషా,ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- October 19, 2017బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఇవాళ ఒడిషాలోని పూరి-చాంద్బలిల మధ్య తీరం దాటనుంది.
ప్రస్తుత వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిషా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. అన్ని ప్రధాన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకెళ్లొద్దని హెచ్చరించారు.
అటు..వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్ష సూచనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని మత్స్యకారుల్ని అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో అంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం