అందుబాటులోకి 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్
- October 27, 2017ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే వినియోగించుకునే వీలుంది.
మెస్సేజ్ రీకాల్ ఫీచర్ను దశల వారీగా అమలు చేస్తామని గతంలోనే వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. టెక్ట్స్ సందేశాలు, చిత్రాలు, జిఫ్ ఫైల్స్, వీడియోలు, కాంటాక్ట్లు ఇలా అన్నింటినీ ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు.
అయితే ఈ మెసేజ్లు రీకాల్ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలి. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది. దీనితో పాటు పంపిన సందేశాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వాట్సాప్ అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది పనిచేయటం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..