అందుబాటులోకి 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్
- October 27, 2017ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే వినియోగించుకునే వీలుంది.
మెస్సేజ్ రీకాల్ ఫీచర్ను దశల వారీగా అమలు చేస్తామని గతంలోనే వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. టెక్ట్స్ సందేశాలు, చిత్రాలు, జిఫ్ ఫైల్స్, వీడియోలు, కాంటాక్ట్లు ఇలా అన్నింటినీ ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు.
అయితే ఈ మెసేజ్లు రీకాల్ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలి. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది. దీనితో పాటు పంపిన సందేశాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వాట్సాప్ అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది పనిచేయటం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..