సినీ పాటలకు గుడ్ బై చెప్పిన గాయని ఎస్.గాయని.. !!

- October 30, 2017 , by Maagulf
సినీ పాటలకు గుడ్ బై చెప్పిన గాయని ఎస్.గాయని.. !!

సినీ వినీలాకాశంలో సుమధుర గాయని.. దక్షిణ భారత దేశ గాన కోకిల ఎస్.జానకి. సుమారు 6 దశాబ్ధాలుగా తన సుమధుర స్వరంతో అశేష ప్రజానీకాన్ని మంత్ర ముగ్ధులను చేసిన ఎస్.జానకి సినిమాల్లో గనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. జానకి మైసూరులోని మానస గంగోత్రి ఆడిటోరియంలో శనివారం జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న జానకి తన వీడ్కోలు వార్తను ప్రకటించారు. సంగీత విభావరిలో చివరిసారిగా కన్నడ చిత్రాల్లో తాను పాడిన పాటల్లో తనకు ఇష్టమైన పాటలను ఆలపించారు. అనంతరం వీడ్కోలు చెప్పారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన రాజమాత ప్రమోదా దేవి, ఇతర నటీమణులు జానకి ని ఘనంగా సన్మానించారు. దాదాపు అన్ని భాషల సినిమాల్లో తన గాత్రంతో అలరించిన జానకికి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com