తమిళనాడుకు భారీ వర్షసూచన
- October 30, 2017
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయానికి తీవ్రరూపం దాల్చింది.
రాబోయే 5రోజులపాటు (శుక్రవారం)వర్షాలు కొనసాగుతాయని,నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అధిక పీడనమే వర్షాలకు కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ప్రభావం వల్ల చెన్నై, కడలూరు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, నాగపట్టణం, తంజావూర్, తిరువారూర్, రామనాథపురం తదితర ప్రాంతాల్లో మరో 24గంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్టోబర్ 27న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబర్ మొదటి వారం వరకు వర్షాలు కొనసాగుతాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







