కేరళలో కుప్పకూలిన ఐరన్ బ్రిడ్జి.. ఒకరు మృతి, 57మందికి గాయాలు
- October 30, 2017
కేరళలో భారీ ప్రాణ నష్టం తప్పింది. భారీ వంతెన కుప్పకూలి.. ఒకరు చనిపోయారు. 80మందికి పైగా నదిలో కొట్టుకుపోయారు. చివరకు తీవ్ర గాయాలతో ఈదుకుంటూ వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. కొల్లం శివారులోని చవారా ప్రాంతంలోని పురాతన వంతెన ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది.
పురాతన బ్రిడ్జి కూలడంతో ఒకరు మృతి చెందగా, మరో 57 మంది గాయపడ్డారు. స్థానికులు మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్ప కూలింది. ఘటన సమయంలో బ్రిడ్జిపై దాదాపు 80 మంది వరకు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు ఈత కొడుతూ బయటకు వచ్చినప్పటికీ…. ఇనుప బ్రిడ్జి కావడంతో, చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. ఈ బ్రిడ్జి చాలా పురాతనమైనదని, తుప్పు పట్టడంతో దీనిపై రాకపోకలు నిలిపివేయాలని చాలా రోజుల క్రితమే కోరినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అధికారులు ఎలాంటి మరమ్మత్తులు చేయకపోవడం, రాకపోకలు నిషేదించకపోవడంతో ప్రమాదం జరిగిందంటున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!