దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాల్ విజేతలు వీళ్ళే
- October 31, 2017తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ డ్రాలో ఇద్దరు విజేతలు చెరో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇందులో జపాన్కి చెందిన 47 ఏళ్ళ యజునోబు యమద 255 సిరీస్లో 2024 టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఈ బహుమతి గెల్చుకున్న రెండో జపనీయుడు కావడం గమనించదగ్గ విషయం. ఇది తనకు దుబాయ్లో రెండో ట్రిప్ అనీ, ఈ రెండో ట్రిప్ తనను ఇంతటి ధనవంతుడ్ని చేస్తుందనుకోలేదని యమద చెప్పారు. మరో లక్కీ విన్నర్ దుబాయ్లోని భారతీయుడు సంతోష్ విజయన్. 50 ఏళ్ళ సంతోష్ విజయన్ కూడా 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. దుబాయ్లో 27 ఏళ్ళుగా నివసిస్తున్న సంతోష్ విజయన్, అబుదాబీలోని ఓ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రి. నవంబర్ 11న తాను 51వ పుట్టినరోజు జరుపుకోనున్నాననీ, ఇది తనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటానని విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే