దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాల్ విజేతలు వీళ్ళే
- October 31, 2017
తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ డ్రాలో ఇద్దరు విజేతలు చెరో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇందులో జపాన్కి చెందిన 47 ఏళ్ళ యజునోబు యమద 255 సిరీస్లో 2024 టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఈ బహుమతి గెల్చుకున్న రెండో జపనీయుడు కావడం గమనించదగ్గ విషయం. ఇది తనకు దుబాయ్లో రెండో ట్రిప్ అనీ, ఈ రెండో ట్రిప్ తనను ఇంతటి ధనవంతుడ్ని చేస్తుందనుకోలేదని యమద చెప్పారు. మరో లక్కీ విన్నర్ దుబాయ్లోని భారతీయుడు సంతోష్ విజయన్. 50 ఏళ్ళ సంతోష్ విజయన్ కూడా 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. దుబాయ్లో 27 ఏళ్ళుగా నివసిస్తున్న సంతోష్ విజయన్, అబుదాబీలోని ఓ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రి. నవంబర్ 11న తాను 51వ పుట్టినరోజు జరుపుకోనున్నాననీ, ఇది తనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటానని విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







