పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి
- October 31, 2017
ఉత్తర కొరి యా అణు ప్రయోగం జరిపిన పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి అయ్యారు.
అక్టోబర్ 10 ఆ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయిందని జపాన్ టెలివిజన్ వెల్లడించారు. ముందు సొరంగంలో వంద మంది చిక్కుకున్నారు. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకునే సరికే మిగతా భాగం కుప్పకూలిలోయిందని అసాహీ టీవీ పేర్కొంది. ఈ దుర్ఘటనలో మొత్తం 200 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ప్రమాదంపై ఉత్తర కొరియా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో అణు ప్రయోగం నిర్వహించారని దానివల్లే ఆ ప్రదేశం మొత్తం దెబ్బతిందని జపాన్ టివి స్పష్టం చేసింది. పుంగేరి వద్ద భూ ఉపరితలం వద్ద ఇలాంటి ప్రయోగాలు నిర్వహిండం ముప్పేనని నిపుణలు హెచ్చరించినా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లక్ష్యపెట్టలేదు. దీంతో ఈ ఉపద్రం వచ్చిపడిందని జపాన్ మిడియా ఆరోపించింది. ప్రయోగాలు జరిగే ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్వతాలపై నుంచి కొండ చరియలు విరిగిపడడం, రేడియేషన్ లీకవ్వడం వంటి దుష్ఫలితాలుంటాయని ముందే ఆందోళన వ్యక్తమైంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







