పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి
- October 31, 2017
ఉత్తర కొరి యా అణు ప్రయోగం జరిపిన పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి అయ్యారు.
అక్టోబర్ 10 ఆ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయిందని జపాన్ టెలివిజన్ వెల్లడించారు. ముందు సొరంగంలో వంద మంది చిక్కుకున్నారు. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకునే సరికే మిగతా భాగం కుప్పకూలిలోయిందని అసాహీ టీవీ పేర్కొంది. ఈ దుర్ఘటనలో మొత్తం 200 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ప్రమాదంపై ఉత్తర కొరియా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో అణు ప్రయోగం నిర్వహించారని దానివల్లే ఆ ప్రదేశం మొత్తం దెబ్బతిందని జపాన్ టివి స్పష్టం చేసింది. పుంగేరి వద్ద భూ ఉపరితలం వద్ద ఇలాంటి ప్రయోగాలు నిర్వహిండం ముప్పేనని నిపుణలు హెచ్చరించినా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లక్ష్యపెట్టలేదు. దీంతో ఈ ఉపద్రం వచ్చిపడిందని జపాన్ మిడియా ఆరోపించింది. ప్రయోగాలు జరిగే ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్వతాలపై నుంచి కొండ చరియలు విరిగిపడడం, రేడియేషన్ లీకవ్వడం వంటి దుష్ఫలితాలుంటాయని ముందే ఆందోళన వ్యక్తమైంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!