పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి
- October 31, 2017
ఉత్తర కొరి యా అణు ప్రయోగం జరిపిన పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి అయ్యారు.
అక్టోబర్ 10 ఆ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయిందని జపాన్ టెలివిజన్ వెల్లడించారు. ముందు సొరంగంలో వంద మంది చిక్కుకున్నారు. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకునే సరికే మిగతా భాగం కుప్పకూలిలోయిందని అసాహీ టీవీ పేర్కొంది. ఈ దుర్ఘటనలో మొత్తం 200 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ప్రమాదంపై ఉత్తర కొరియా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో అణు ప్రయోగం నిర్వహించారని దానివల్లే ఆ ప్రదేశం మొత్తం దెబ్బతిందని జపాన్ టివి స్పష్టం చేసింది. పుంగేరి వద్ద భూ ఉపరితలం వద్ద ఇలాంటి ప్రయోగాలు నిర్వహిండం ముప్పేనని నిపుణలు హెచ్చరించినా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లక్ష్యపెట్టలేదు. దీంతో ఈ ఉపద్రం వచ్చిపడిందని జపాన్ మిడియా ఆరోపించింది. ప్రయోగాలు జరిగే ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్వతాలపై నుంచి కొండ చరియలు విరిగిపడడం, రేడియేషన్ లీకవ్వడం వంటి దుష్ఫలితాలుంటాయని ముందే ఆందోళన వ్యక్తమైంది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







