పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి
- October 31, 2017 ఉత్తర కొరి యా అణు ప్రయోగం జరిపిన పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి అయ్యారు.
అక్టోబర్ 10 ఆ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయిందని జపాన్ టెలివిజన్ వెల్లడించారు. ముందు సొరంగంలో వంద మంది చిక్కుకున్నారు. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకునే సరికే మిగతా భాగం కుప్పకూలిలోయిందని అసాహీ టీవీ పేర్కొంది. ఈ దుర్ఘటనలో మొత్తం 200 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ప్రమాదంపై ఉత్తర కొరియా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో అణు ప్రయోగం నిర్వహించారని దానివల్లే ఆ ప్రదేశం మొత్తం దెబ్బతిందని జపాన్ టివి స్పష్టం చేసింది. పుంగేరి వద్ద భూ ఉపరితలం వద్ద ఇలాంటి ప్రయోగాలు నిర్వహిండం ముప్పేనని నిపుణలు హెచ్చరించినా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లక్ష్యపెట్టలేదు. దీంతో ఈ ఉపద్రం వచ్చిపడిందని జపాన్ మిడియా ఆరోపించింది. ప్రయోగాలు జరిగే ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్వతాలపై నుంచి కొండ చరియలు విరిగిపడడం, రేడియేషన్ లీకవ్వడం వంటి దుష్ఫలితాలుంటాయని ముందే ఆందోళన వ్యక్తమైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా