గిన్నిస్ రికార్డు కోసం గరిట తిప్పిన బాబా రాందేవ్
- November 04, 2017
కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్ని పక్కన పెట్టి, ఇప్పుడు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడానికి కిచిడీ సిద్దమవుతోంది. ఢిల్లీ వేదికగా 'వరల్డ్ ఫుడ్ ఇండియా కాన్ఫరెన్స్' మూడురోజుల సదస్సులో భాగంగా ప్రముఖ పాక శాస్త్రనిపుణుడు సంజవ్ కపూర్ ఆధ్వర్యంలో కిచిడీని తయారు చేస్తున్నారు. 60,000 మంది అనాథ పిల్లలకు, సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన 60 దేశాలకు చెందిన ప్రతినిధులకు ఈ కిచిడీని వడ్డిస్తారు. ఇందుకు గాను 800 కేజీల ధాన్యాలతో బ్రాండ్ ఇండియా కిచిడీని తయారు చేస్తున్నారు. కిచిడీ తయారీ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్, సాధ్వీ నిరంజన్, యోగా గురువు బాబా రాందేవ్లు కూడా హాజరయ్యి వారు కూడా గరిట తిప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







