దేశంలో ప్యారడైజ్ పేపర్ల ప్రకంపనలు
- November 06, 2017
దేశంలో ప్యారడైజ్ పేపర్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్లు ఎగ్గొట్టేందుకు అడ్డదార్లు తొక్కారంటూ 714 మంది ప్రముఖల పేర్లు బయటకొచ్చాయి. వారిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఈ అంశాన్ని చూస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT అధికారులు స్పష్టం చేశారు. ఇందులో CBDT, ఈడీ, రిజర్వ్బ్యాంక్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఈ మల్టీ ఏజెన్సీ గ్రూప్ గతేడాది ఏప్రిల్లో ఏర్పాటైంది. అక్రమ మార్గాల్లో పన్ను ఎగవేశారంటూ పనామా పేపర్స్ బయటకు రావడంతో.. వాటిపై విచారణ జరుపుతోంది. దానికే.. ప్యారడైజ్ పేర్లను అప్పగించారు. మరి, నిజానిజాలను ఎప్పుడు నిగ్గు తేలుస్తారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!