‘యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ క్షేమం
- November 08, 2017 (2)_1510148582.jpg)
రియాద్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ మరణించారని వెలువడుతున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలింది. అజీజ్ మరణించారని పలు మీడియా, సోషల్ మీడియాలో వెలువడుతున్న వార్తలను సౌదీ సమాచార శాఖా ఖండించింది. యువరాజు అజీజ్ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రత్యేక పరిస్థితుల కారణంగా యువరాజు ప్రస్తుతం స్పందించలేరని పేర్కొంది. వదంతలు నమ్మవద్దని, వ్యాపింప చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సౌదీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 12 మంది యువరాజులతో సహా, మంత్రులు, బడా వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకోవడం సౌదీ ఆధునిక చరిత్రలో కీలకమైన ఘటనగా పలువురు రాజకీయ నిపుణులు పేర్కుంటున్నారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సౌదీ ప్రభుత్వం తెలిపిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ