‘యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ క్షేమం
- November 08, 2017
రియాద్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ మరణించారని వెలువడుతున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలింది. అజీజ్ మరణించారని పలు మీడియా, సోషల్ మీడియాలో వెలువడుతున్న వార్తలను సౌదీ సమాచార శాఖా ఖండించింది. యువరాజు అజీజ్ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రత్యేక పరిస్థితుల కారణంగా యువరాజు ప్రస్తుతం స్పందించలేరని పేర్కొంది. వదంతలు నమ్మవద్దని, వ్యాపింప చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సౌదీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 12 మంది యువరాజులతో సహా, మంత్రులు, బడా వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకోవడం సౌదీ ఆధునిక చరిత్రలో కీలకమైన ఘటనగా పలువురు రాజకీయ నిపుణులు పేర్కుంటున్నారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సౌదీ ప్రభుత్వం తెలిపిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







