తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళన

- November 10, 2017 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళన

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కేసుల కారణంగా పోలీసు ఉద్యోగాలకు అనర్హులను చేశారనంటూ నిరసన చేపట్టారు. కాగా వీరిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట చోటు చేసుకొంది. పోలీసు అభ్యర్థులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com