భారత ఎయిమ్స్ జూనియర్ డాక్టర్కు 'పుతిన్' ప్రశంస
- November 10, 2017ఆలిండియా ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) జూనియర్ డాక్టర్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. రష్యాలో వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 185 దేశాల నుంచి 24వేల మంది పాల్గొన్నారు.వారిలో 12 మంది విద్యార్థులను ఫైనల్కు ఎంపిక చేసి పుతిన్తో భేటీ అయ్యే అవకాశం కల్పించారు. భారత్ నుంచి వచ్చిన డాక్టర్ రచ్చా భట్ ఈ కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచి పుతిన్ అభినందనలు పొందారు. యాంటీ బయోటిక్స్ రెసిస్టెన్స్ అంశంపై డాక్టర్ రచ్చా భట్ చేసిన ప్రెజెంటేషన్ను సహచర విద్యార్థులు సైతం అభినందించారు. డాక్టర్ భట్ 2015 నుంచి ఎయిమ్స్లో జూనియర్ రెసిడెంట్గా ( ఎమర్జెన్సీ మెడిసిన్స్ విభాగంలో ) పనిచేస్తున్నారు. వైద్యులు, రోగుల కోసం ఆమె రూపొందించిన ఇ-పోర్టల్ విధానం గురించి వివరించారు. ఈ విధానం ద్వారా రోగి వివరాలను సేకరించిన వైద్యులు ఆన్లైన్లోనే ఎలక్ట్రానిక్స్ ప్రెస్కిప్షన్ అందజేయవచ్చు. సకాలంలో ఆస్పత్రికి చేరలేని రోగులకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని భట్ వివరించారు. భట్ ప్రతిభను ఎయిమ్స్ డీన్ ( అకడమిక్స్ ) ప్రొఫెసర్ బల్రామ్ ఐరాన్ ప్రశంసించారు.
భారత్ ప్రతిష్టను భట్ విదేశాల్లోనూ ఇనుమడించారని అన్నారు. భట్ ప్రతిభావంతురాలని ప్రశంసించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్