భారత రాయబార కార్యాలయంలో ఐక్యవేదిక సభ్యులు
- November 12, 2017
కువైట్: తెలుగు సంఘాల ఐక్యవేదిక సభ్యులు కువైట్లో భారత రాయబారిని బుధవారం కలిశారు. వేదిక కన్వీనరు కుదరవల్లి సుధాకర్రావు ఆధ్వర్యంలో కువైట్లో ఉంటున్న 40 మంది తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు భారత రాయబారి కార్యాలయంలోని అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ డీసీఎం రాజగోపాల్ సింగ్కు కన్వీనరు సుధాకర్రావు సభ్యులను పరిచయం చేశారు. కువైట్లో తెలుగు సంఘాలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి డీసీఎంకు సభ్యులు వివరించారు. తెలుగు లలిత కళా సమితి అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్బాబు ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను అధికారులకు వివరించారు. రాయలసీమ గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ కువైట్లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రవాసాంధ్ర అధ్యక్షుడు మాలేపాటి సురేష్బాబు, మన కడప సేవాసమితి అధ్యక్షుడు సుబ్బు, అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా కలిసి డీసీఎం ప్రభాకర్ను సత్కరించారు. కువైట్లో తెలుగువారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వారిని ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలుగు సంఘాల ఐక్యవేదిక తీర్మానించినట్లు కన్వీనరు కుదరవల్లి సుధాకర్రావు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







