భారత రాయబార కార్యాలయంలో ఐక్యవేదిక సభ్యులు
- November 12, 2017
కువైట్: తెలుగు సంఘాల ఐక్యవేదిక సభ్యులు కువైట్లో భారత రాయబారిని బుధవారం కలిశారు. వేదిక కన్వీనరు కుదరవల్లి సుధాకర్రావు ఆధ్వర్యంలో కువైట్లో ఉంటున్న 40 మంది తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు భారత రాయబారి కార్యాలయంలోని అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ డీసీఎం రాజగోపాల్ సింగ్కు కన్వీనరు సుధాకర్రావు సభ్యులను పరిచయం చేశారు. కువైట్లో తెలుగు సంఘాలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి డీసీఎంకు సభ్యులు వివరించారు. తెలుగు లలిత కళా సమితి అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్బాబు ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను అధికారులకు వివరించారు. రాయలసీమ గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ కువైట్లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రవాసాంధ్ర అధ్యక్షుడు మాలేపాటి సురేష్బాబు, మన కడప సేవాసమితి అధ్యక్షుడు సుబ్బు, అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా కలిసి డీసీఎం ప్రభాకర్ను సత్కరించారు. కువైట్లో తెలుగువారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వారిని ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలుగు సంఘాల ఐక్యవేదిక తీర్మానించినట్లు కన్వీనరు కుదరవల్లి సుధాకర్రావు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!