భారత రాయబార కార్యాలయంలో ఐక్యవేదిక సభ్యులు

- November 12, 2017 , by Maagulf
భారత రాయబార కార్యాలయంలో ఐక్యవేదిక సభ్యులు

కువైట్‌: తెలుగు సంఘాల ఐక్యవేదిక సభ్యులు కువైట్‌లో భారత రాయబారిని బుధవారం కలిశారు. వేదిక కన్వీనరు కుదరవల్లి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో కువైట్‌లో ఉంటున్న 40 మంది తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు భారత రాయబారి కార్యాలయంలోని అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ డీసీఎం రాజగోపాల్‌ సింగ్‌కు కన్వీనరు సుధాకర్‌రావు సభ్యులను పరిచయం చేశారు. కువైట్‌లో తెలుగు సంఘాలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి డీసీఎంకు సభ్యులు వివరించారు. తెలుగు లలిత కళా సమితి అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్‌బాబు ఐక్యవేదిక భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలను అధికారులకు వివరించారు. రాయలసీమ గల్ఫ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంగాధర్‌ కువైట్‌లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రవాసాంధ్ర అధ్యక్షుడు మాలేపాటి సురేష్‌బాబు, మన కడప సేవాసమితి అధ్యక్షుడు సుబ్బు, అమ్మ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ తదితరులు అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా కలిసి డీసీఎం ప్రభాకర్‌ను సత్కరించారు. కువైట్‌లో తెలుగువారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వారిని ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలుగు సంఘాల ఐక్యవేదిక తీర్మానించినట్లు కన్వీనరు కుదరవల్లి సుధాకర్‌రావు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com