రెహ్మాన్ కన్సర్ట్ కి హాజరవనున్న మోడీ, ట్రంప్ కుమార్తె
- November 12, 2017
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ త్వరలో హైదరాబాద్ రాబోతున్నారు. నవంబర్ 28న హెచ్ఐసీసీ(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో జరగనున్న జీఈఎస్(గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్) సమావేశంలో భాగంగా ఆమె తొలిసారి భారత్ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది.
అయితే 26న గచ్చిబౌలి స్టేడియంలో జరగబోయే ఏ.ఆర్ రెహమాన్ కచేరీ కార్యక్రమానికి ఇవాంక హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్లనున్నారట. హైదరాబాద్లోని రహేజా మైండ్ స్పేస్లోని హోటల్లో ఇవాంక బస చేయనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఆమె కోసం డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
భారత్ పర్యటనలో భాగంగా ఇవాంక..
చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ తదితర పర్యటక ప్రాంతాలను వీక్షించనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







