ఢిల్లీకి భారీగా అక్రమ రవాణాలు
- November 12, 2017
దిల్లీ: మిక్సీలు, గ్రైండర్లు, చెప్పులు, హ్యాండ్స్టిక్స్, లోదుస్తులు.. కాదేదీ స్మగ్లింగ్కు అనర్హం అన్నట్లుగా బంగారాన్ని వాటిల్లో దాచిపెట్టి అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్నారు కొందరు వ్యక్తులు. అయితే అలాంటి వారిని కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకుంటున్నారు కూడా. అలా ఈ ఏడాది దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఇప్పటివరకూ 110కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ కస్టమ్స్ అధికారి వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దిల్లీ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 110 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపు రూ.37కోట్లు ఉంటుంది. మొత్తం 114 స్మగ్లింగ్ కేసులు నమోదవగా.. 62 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా.. గతేడాదితో పోలిస్తే స్మగ్లింగ్ తగ్గిందని.. నోట్ల రద్దే అందుకు కారణమని వెల్లడించారు.
2016లో దిల్లీలో మొత్తం 110 స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. 79 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.48కోట్ల విలువైన 188 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







