యాభై ఏళ్ళ నాటి సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ నిరవధికంగా మూసివేత
- November 19, 2017జెడ్డా : పురాతన చమురు శుద్ధి కర్మాగారం మూతపడింది. పర్యావరణ సమస్య ఉండటంతో జెట్డాలో రోజుకు 90,000 బ్యారెల్ ముడి చమురు శుద్ధి చేసే సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ కర్మాగారాన్ని నిరవధికంగా మూసివేశారు. జెడ్డాకు చెందిన పారిశ్రామిక వర్గాల సమాచారం మేరకు ఈ సంగతి వెలుగులోనికి వచ్చింది. ఆ కర్మాగారం కాలం చెల్లడం మరియు పర్యావరణv ఆందోళనల కారణంగా రిఫైనరీని మూసివేయడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1967 లో ఆరంభమైన ఈ చమురుశుద్ధి కర్మాగారం దేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగం తన విలువైన సేవలను అందించింది. ఈ మూసివేత కారణంగా ఇతర సౌదీ చమురుశుద్ధి కర్మాగారాల వద్ద డిమాండ్ పెరుగుతుంది. సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ ద్రవీకృత పెట్రోలియం వాయువు, గ్యాసోలిన్, డీజిల్, తారు మరియు జెట్ ఇంధనం మరియు నఫ్తాలను సమర్ధవంతంగా ఎగుమతి చేసింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ