అమరావతిలో సందడిచేసిన దీపికా పదుకొనే, రానా
- November 19, 2017విజయవాడలో తారలు తళుక్కు మన్నారు. సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా సందడి చేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది.
ఏపీ పర్యాటక శాఖ సోషల్ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అవార్డ్ను దీపికా దీపికా పదుకొనే అందుకోగా.. మోస్ట్ యాక్టివ్ సౌత్ ఇండియన్ యాక్టర్ అవార్డును దగ్గుబాటి రానా అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అవార్డ్ అనిరుధ్ కు దక్కింది. వీరికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అవార్డులు ప్రదానం చేశారు.
అంతకు ముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దీపికాకు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత విజయవాడలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో దీపిక పాల్గొన్నారు. సెలబ్రిటీలను చూసేందుకు తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం