దుబాయ్ నుంచి వచ్చాక! యువకుడి ఆత్మహత్య...ఆమే కారణం
- November 20, 2017
మెదక్: ఓ వివాహిత వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహిత అయిన ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బోనగరి రమేష్(23) అనే యువకుడు ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మూడు నెలల క్రితమే తిరిగొచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్టు తెలుస్తోంది.
వివాహిత వేధింపులతో రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతిపై అతని తండ్రి మొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!