హెల్త్ కేర్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న హెచ్ఎంసి
- November 20, 2017హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి), హెల్త్కేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సొసైటీ (హెచ్ఐఎమ్ఎస్ఎస్)తో కలిసి హెచ్ఐఎంఎస్ఎస్ ఖతార్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అండ్ హెల్త్ ఐటీ ఎగ్జిబిషన్ని సంయుక్తంగా నిర్వహించనుంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు షెరటాన్ రగాండ్ దోహా రిసార్ట్ అండ్ కన్వెన్షన్ హాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, సిడ్రా మెడిసిన్ నేతృత్వంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. హెల్త్కేర్ ప్రొఫెషనల్స్కి ఈ ఈవెంట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని హెచ్ఎంసి క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వాహబ్ అల్ ముస్లెహ్ చెప్పారు. 1961లో ఏర్పాటైన హెచ్ఐఎంఎస్ఎస్, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఐటీ వినియోగం ద్వారా తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఇన్నోవేషన్, కొలాబరేషన్, ఎడ్యుకేషన్ - ఐటీ - హెల్త్ సెక్టార్ వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్చ ఈ ఈవెంట్లో జరగనుంది.
తాజా వార్తలు
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు