దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఘరానా మోసం
- November 21, 2017
హైదరాబాద్:మోసాల్లో ఆరితేరిన పలువురిని నిండా ముంచిన ఘరాన కి'లేడీ'పై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ చట్టం ప్రయోగించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ పట్టణం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన తాటిపర్తి షీబారాణి(46) దుబాయ్లో ఉద్యోగం, వీసాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగుల్ని మోసం చేసింది. బియ్యం, మాంసం వ్యాపారుల్నీ వంచించినందుకు ఇప్పటికే ఈమెపై 8 కేసులు నమోదయ్యాయి. వారణాసి విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన ఆమె నగరానికి మకాం మార్చింది. 2000 సంవత్సరంలో సికింద్రాబాద్ చర్చిఫాదర్ జోయెల్తో పరిచయం పెంచుకుంది. దేశవ్యాప్తంగా అనాథాశ్రమాలను నడిపే అతడితో విదేశాలు తిరిగింది. 2010లో అతడు మరణించడంతో బయటికి వచ్చి బియ్యం, మాంసం వ్యాపారాల్లోకి దిగింది. ఉద్దెర ప్రాతిపదికన బియ్యం, మేకల్ని తీసుకొచ్చి వ్యాపారులకు డబ్బులివ్వకుండా సతాయించేది.
ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో మిర్యాలగూడలో ఏడాదిపాటు జైలుపాలైంది. అనంతరమూ పద్ధతి మార్చుకోని ఆమె నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసింది. మొత్తం ఏడుగురిని రూ.87.45లక్షలకు మోసం చేసింది. అలాగే జవహర్నగర్ యాప్రాల్లో ఉంటూ పరిసర ప్రాంతాల్లోని సంపన్నకుటుంబాల మహిళతో పరిచయం పెంచుకునేది.
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే షీబారాణి తనకు అప్పుగా డబ్బు ఇచ్చేందుకు నిరాకరించే మహిళలతో గొడవలకు దిగేది. ఈ ఫిర్యాదులతో ఈనెల 14న జవహర్నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి నాలుగు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు, నాలుగు చరవాణుల్ని స్వాధీనం చేసుకొన్నారు. గత మూడు నెలల కాలంలోనే ఆమెపై నాలుగు కేసులు నమోదు కావడంతో కమిషనర్ ఆమెపై మంగళవారం పీడీ చట్టం ప్రయోగించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!