హజ్ యాత్రికుల వసతి కమిటీలో ప్రొఫెసర్ షుకూర్
- November 21, 2017
హజ్ యాత్రికులకు సౌదీ అరేబియాలోని మక్కాలో వసతి సౌకర్యం కల్పించేందుకు భవనాలు ఎంపిక చేసే కమిటీకి తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మన దేశం నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు మక్కాలో వసతి సౌకర్యం అందించే భవనాలను ఖరారు చేసే కేంద్ర హజ్ కమిటీ ప్రతినిధి బృందంలో ఆయన సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ జనవరి రెండో వారంలో మక్కాను సందర్శించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే ఆగస్టు నెలలో నిర్వహించే హజ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది అన్ని రాష్ట్రాల నుంచి 1.25 లక్షల మంది ముస్లింలకు అవకాశమిచ్చారు. తెలంగాణ నుంచి హజ్ కమిటీ పర్యవేక్షణలో 3,500 మందికి పైగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 70 ఏళ్లకు పైబడిన వారిని హజ్ యాత్రకు నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన ఖాళీల్లో దరఖాస్తుదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. 2018లో హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలు డిసెంబరు 17 వరకు దరఖాస్తులు పంపుకోవాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







