ప్రతి ఇమామ్కు నెలకు రూ.10వేలు వేతనం ఇస్తాం
- November 25, 2017
వైసీపీ అధికారంలోకి వచ్చాక మసీదులో ప్రతి ఇమామ్కు నెలకు రూ.10వేలు వేతనం ఇస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. పుట్లూరు సమీపంలో జగన్ ముస్లింల ఆత్మీయ సదస్సుకు హాజరయ్యారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని, జగన్ సీఎం కావాలని ముస్లిం మత పద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ పాలనను కొనసాగించాలని ఈ సందర్భంగా జగన్కు ముస్లింలు విజ్ఞప్తి చేశారు. ముస్లింల ఆత్మీయ సదస్సులో జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదు, చర్చి, దేవాలయాలకు రూ.15వేలు నిర్వహణ ఖర్చులు ఇస్తామన్నారు. వైఎస్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. 8 శాతం రిజర్వేషన్లంటూ ముస్లింలను చంద్రబాబు నిలువునా ముంచారన్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!









