ప్రతి ఇమామ్కు నెలకు రూ.10వేలు వేతనం ఇస్తాం
- November 25, 2017
వైసీపీ అధికారంలోకి వచ్చాక మసీదులో ప్రతి ఇమామ్కు నెలకు రూ.10వేలు వేతనం ఇస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. పుట్లూరు సమీపంలో జగన్ ముస్లింల ఆత్మీయ సదస్సుకు హాజరయ్యారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని, జగన్ సీఎం కావాలని ముస్లిం మత పద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ పాలనను కొనసాగించాలని ఈ సందర్భంగా జగన్కు ముస్లింలు విజ్ఞప్తి చేశారు. ముస్లింల ఆత్మీయ సదస్సులో జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదు, చర్చి, దేవాలయాలకు రూ.15వేలు నిర్వహణ ఖర్చులు ఇస్తామన్నారు. వైఎస్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. 8 శాతం రిజర్వేషన్లంటూ ముస్లింలను చంద్రబాబు నిలువునా ముంచారన్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







