ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్
- November 25, 2017
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. పాకిస్తాన్ న్యాయ శాఖామంత్రి జమీద్ అహ్మద్ను పదవినుంచి తొలగించాలంటూ 20 రోజులుగా దేశ రాజధాని ఇస్లామాబాద్లో ఆందోళనలు జరుగుతున్నాయి. తెహ్రిక్ ఏ లబాయిక్ యా రసూల్ అల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కారులు ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే రోడ్తో పాటు.. రావల్పిండికి వెళ్లే ఎక్స్ప్రెస్ హైవేను దిగ్భంధించారు. వీరికి సర్దిచెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఇవాళ పోలీసులను దింపింది ప్రభుత్వం. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్తో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయితే.. అదే స్థాయిలో నిరసనకారులు ప్రతిఘటించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. కొంతమంది టియర్గ్యాస్ను కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అటు ఆందోళనలు కరాచీ, లాహోర్, ఫైజలాబాద్, పెషావర్, సియాల్కోట్ లాంటి ఇతర ప్రాంతాలకూ పాకాయి. ఇస్లామాబాద్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు వస్తుండడంతో.. పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఓ వైపు ఈ ఆందోళనలను నిరోధించడం చేతగాని పాకిస్తాన్ ప్రభుత్వం.. మన పై అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టింది. ఇస్లామాబాద్లో జరుగుతున్న ఆందోళనలకు మన దేశం మద్దతిస్తోందంటూ సాక్షాత్తూ పాక్ ఇంటీరియర్ మినిస్టర్ ఆషాన్ ఇక్బాల్ ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









