డ్రోన్ దాడిలో తీవ్రవాదులు హతం
- November 26, 2017
ఎడెన్(యెమెన్): దక్షిణ యెమెన్లో అల్ఖైదా లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు తీవ్రవాదులు హతమయ్యారు. యెమెన్పై డ్రోన్ దాడులు జరిపే సత్తా ఒక్క అమెరికా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షాబా ప్రావిన్స్ నుంచి బేడా ప్రావిన్స్కు వెళ్లే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలపై అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి బాంబు దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని భావిస్తున్నారు. యెమెన్ కేంద్రంగా నడుస్తున్న అల్ఖైదా విభాగం ఈ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని కొంతకాలంగా అమెరికా అనుమానిస్తోంది. ఈ తీవ్రవాదులకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తూ స్థానిక హుతి రెబల్స్పై ఉసిగొలుపుతోంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అల్ఖైదాపై అమెరికా డ్రోన్ దాడులు సాగిస్తోంది.
తాజా వార్తలు
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?







