రిస్క్ చేసిన బన్నీ
- November 26, 2017వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడా సీన్స్ అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వంశీ మురిసిపోతున్నాడు. ఇదంతా బన్నీ క్రెడిట్ నే అంటున్నాడు. ఎందుకంటే.. ఆ యాక్షన్ ఏపీసోడ్స్ చాలా రిస్క్ తో కూడుకొన్నవి అట. వాటిని బన్నీ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. వాటిని తెరపై చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి గురవుతారని చెప్పుకొంటున్నాడు.
దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అను నేను' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో స్టయిలీష్ స్టార్, సూపర్ స్టార్ ల బాక్సీఫీసు ఫైట్ ని ఆరోజు చూడొచ్చన్న మాట.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ