విజేతల్ని ఆకాశానికి ఎత్తే విధానం మారాలి..
- November 29, 2017
ఆటలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సరదాగా మొదలు పెట్టిన ఆట అదే కెరీర్గా మారుతుందని ఎవరూ ఊహించరు. అవకాశాలు కూడా అందర్నీ వరించవు. గెలుపు ఓటముల రుచి చూస్తూ, ఎత్తు పల్లాల్ని అధిగమిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొటూ చివరకు ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు. అది ఒక్క ఆటల్లోనే కాదు.. అన్నింటా ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ విజేతల్ని మాత్రమే ఆకాశానికి ఎత్తే ధోరణి సరికాదంటున్నాడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా క్రీడా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన చర్చా గోష్టిలో గోపీచంద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రీడలకు ప్రాధాన్యమిస్తూ స్థానిక క్రీడల్ని మరచి పోతున్నాం. మీడియా కూడా స్థానిక క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి. పారిశ్రామిక వేత్తలు కూడా ఆ దిశగా ఆలోచించాలి అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడల్ని ఒక పరిశ్రమగా భావించి పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించాలి అని అన్నారు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. ఆటలు ఆడే వాళ్లందర్నీ ఛాంపియన్లుగా భావించి ఆ దిశగా ప్రోత్సహిస్తే మెరుగైన క్రీడాకారులు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!