విజయవంతంగా 'ఆకాశ్' ప్రయోగం
- December 05, 2017
బాలాసోర్: ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సూపర్సోనిక్ క్షిపణి 'ఆకాశ్'ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 25 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ అస్త్రంలో తొలిసారిగా స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను ఉపయోగించారు. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్) నుంచి ఈ పరీక్ష జరిగింది. ఇందులో మానవరహిత విమానాన్ని ఈ క్షిపణి లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను నేలకూల్చే ఎలాంటి అస్త్రాన్నైనా రూపొందించే సామర్థ్యం భారత్ సొంతమైంది. ఆకాశ్ వ్యవస్థ.. యుద్ధవిమానాలు; క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను నేలకూల్చగలదు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను నాశనం చేయగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో).. దీన్ని రూపొందించింది. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్ రెడ్డి తాజా పరీక్షను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







