విజయవంతంగా 'ఆకాశ్' ప్రయోగం
- December 05, 2017
బాలాసోర్: ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సూపర్సోనిక్ క్షిపణి 'ఆకాశ్'ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 25 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ అస్త్రంలో తొలిసారిగా స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను ఉపయోగించారు. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్) నుంచి ఈ పరీక్ష జరిగింది. ఇందులో మానవరహిత విమానాన్ని ఈ క్షిపణి లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను నేలకూల్చే ఎలాంటి అస్త్రాన్నైనా రూపొందించే సామర్థ్యం భారత్ సొంతమైంది. ఆకాశ్ వ్యవస్థ.. యుద్ధవిమానాలు; క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను నేలకూల్చగలదు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను నాశనం చేయగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో).. దీన్ని రూపొందించింది. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్ రెడ్డి తాజా పరీక్షను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి