అమెరికా విధానాలను తప్పు పట్టిన భారత్, చైనా
- December 05, 2017
బీజింగ్: అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక, వీసా వ్యతిరేక విధానాలను భారత్, చైనా తప్పు పట్టాయి. రెండు దేశాల ప్రణాళికా సంస్థల మూడో వార్షిక సమావేశాలను పురస్కరించుకుని భారత్, చైనా ఉన్నతాధికార వర్గాలు మంగళవారం ఈ వ్యాఖ్య చేశాయి. అమెరికా అనుసరిస్తున్న చర్యలు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మేలు చేయవని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. అమెరికా అయినా, ఐరోపా అయినా అనుసరించే రక్షణాత్మక విధానాలను తోసిపుచ్చడానికి భారత్-చైనా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అమెరికా విధానాలు మిగిలిన ప్రపంచాన్ని ప్రభావితం చేసేవిగా ఉన్నాయని 'చైనా అభివృద్ధి పరిశోధన కేంద్రం' అధ్యక్షుడు లీ వెయ్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రజాకర్షక విధానాలను విడనాడాలని చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







