ఫ్రిడ్జ్ లో బిడ్డ మృత దేహాన్ని పెట్టిన తల్లి..!!

- December 07, 2017 , by Maagulf
ఫ్రిడ్జ్ లో బిడ్డ మృత దేహాన్ని పెట్టిన తల్లి..!!

పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ మృతి చెందడమే ఆ తల్లి ని బాధ పెట్టేవిషయం అయితే.. మరణించిన బిడ్డకు మరణ ధృవీకరణ పత్రం తీసుకోవడానికి ఆ మృత శిశువును ఉంచమని వైద్యులు చెప్పడంతో.. ఆ తల్లి ఆ బిడ్డ శవాన్ని ఫ్రిజ్ లో పెట్టి దాచడం హృదయ విదారకరమైన సంఘటన.. ఈ ఘటన పేరూలో చోటు చేసుకొన్నది. 

లిమాలో సెర్గియా బర్నెల్స్ హాస్పటల్ లో మోనికా పలోమినో అనే మహిళ శనివారం రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ నెలలు నిండకుండా పుట్టిన ఈ శిశువు సోమవారం మరణించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆ మృత శిశువుని అక్కడ నుంచి వెంటనే తీసుకొని వెళ్ళాలి అని ఒత్తిడి చేశారు.. దీంతో తన బిడ్డ మరణ ధృవీకరణ పత్రం ఇస్తే.. వెళ్లిపోతామని ఆ తల్లి ఎంతగా ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా వినిలేదు.. అంతేకాదు.. డేట్ సర్టిఫికేట్ ఇచ్చేవరకూ ఆ మృత శిశువు దేహాన్ని ఉంచాలని వైద్యులు చెప్పారు.. దీంతో మోనికా చేసేది ఏమీ లేక తన బిడ్డ మృత దేహాన్ని ఇంట్లో ఫ్రిజ్ లో పెట్టింది,... ఆ ఫ్రిజ్ కు "డోంట్ టచ్" అనే స్టిక్కర్ ను అతికించింది.. మోనికా తన బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించాలి.. డేట్ సర్టిఫికేట్ ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యాన్ని వేడుకొంటోంది. ఈ వ్యవహారంపై ఆస్పత్రి డైరెక్టర్ జూలియో సిల్వా స్పందిస్తూ... ఆస్పత్రి నిబంధనల ప్రకారం.. మరణ ధృవీకరణ పత్రం ఇచ్చే వరకూ... మృతశిశువును మార్చురీలో ఉంచాలని.. సర్టిఫికెట్ తో పాటు... బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించాలని ఆయన ఆదేశించారు.. అంతేకాదు.. డేట్ సర్టిఫికేట్ ఇవ్వడం లో నిర్లక్షం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకొంటామని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com