గేమింగ్‌లో పెట్టుబడులతో రండి: కేటీఆర్‌

- December 09, 2017 , by Maagulf
గేమింగ్‌లో పెట్టుబడులతో రండి: కేటీఆర్‌

హైదరాబాద్‌: కంప్యూటర్‌ గేమ్స్‌, యానిమేషన్‌ రంగం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతుంటే.. మన దేశంలో కేవలం 2 బిలియన్‌ డాలర్ల లోపే ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో గేమర్‌ కనెక్ట్‌ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. వీడియో గేమ్‌లు, మల్టీమీడియా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనికి అవసరమైన మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ఎన్‌ వీడియో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వీడియో గేమ్‌లను ఆడి అక్కడ ఉన్నవారిని కేటీఆర్‌ ఉత్సాహపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com