దుబాయ్లో జనవరిలో కొత్త బ్రిడ్జి ప్రారంభం
- December 09, 2017
దుబాయ్:అల్ ఖైల్ రోడ్డు నుంచి ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ వరకు నిర్మితమవుతున్న బ్రిడ్జి 2018లో ప్రారంభం కానుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ సహకారంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ ఇప్పుడు ఫైనల్ టచెస్ని ఆ బ్రిడ్జికి ఇస్తున్నట్లు తెలియవస్తోంది. రెండు లేన్లలో వన్ వే బ్రిడ్జి 1270 మీటర్ల నిడివితో రూపొందుతోంది. అన్ని సౌకర్యాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రస్ అల్ ఖోర్ రోడ్ - అల్ ఖల్ రోడ్ ఇంటర్సెక్షన్ వద్ద ప్రారంభమవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తే చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. గంటకు 4500 వాహనాల్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









