దుబాయ్‌లో జనవరిలో కొత్త బ్రిడ్జి ప్రారంభం

- December 09, 2017 , by Maagulf
దుబాయ్‌లో జనవరిలో కొత్త బ్రిడ్జి ప్రారంభం

దుబాయ్‌:అల్‌ ఖైల్‌ రోడ్డు నుంచి ఫైనాన్షియల్‌ సెంటర్‌ రోడ్‌ వరకు నిర్మితమవుతున్న బ్రిడ్జి 2018లో ప్రారంభం కానుంది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సహకారంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్‌ ఇప్పుడు ఫైనల్‌ టచెస్‌ని ఆ బ్రిడ్జికి ఇస్తున్నట్లు తెలియవస్తోంది. రెండు లేన్లలో వన్‌ వే బ్రిడ్జి 1270 మీటర్ల నిడివితో రూపొందుతోంది. అన్ని సౌకర్యాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రస్‌ అల్‌ ఖోర్‌ రోడ్‌ - అల్‌ ఖల్‌ రోడ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద ప్రారంభమవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తే చాలావరకు ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి. గంటకు 4500 వాహనాల్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com