దుబాయ్లో జనవరిలో కొత్త బ్రిడ్జి ప్రారంభం
- December 09, 2017
దుబాయ్:అల్ ఖైల్ రోడ్డు నుంచి ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ వరకు నిర్మితమవుతున్న బ్రిడ్జి 2018లో ప్రారంభం కానుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ సహకారంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ ఇప్పుడు ఫైనల్ టచెస్ని ఆ బ్రిడ్జికి ఇస్తున్నట్లు తెలియవస్తోంది. రెండు లేన్లలో వన్ వే బ్రిడ్జి 1270 మీటర్ల నిడివితో రూపొందుతోంది. అన్ని సౌకర్యాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రస్ అల్ ఖోర్ రోడ్ - అల్ ఖల్ రోడ్ ఇంటర్సెక్షన్ వద్ద ప్రారంభమవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తే చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. గంటకు 4500 వాహనాల్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







