'సీ ప్లేన్‌'కు ప్రయోగ పరీక్షలు

- December 09, 2017 , by Maagulf
'సీ ప్లేన్‌'కు ప్రయోగ పరీక్షలు

దిల్లీ: నీటిపైనా దిగే, ఎగిరే విమానం 'సీ ప్లేన్‌'కు స్పైస్‌ జెట్‌ శనివారం ప్రయోగ పరీక్షలు నిర్వహించింది. ఇలాంటి వంద విమానాలను ఏడాదిలోగా అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. వీటి విలువ రూ.2,579 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ, విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజుల సమక్షంలో ముంబయిలోని గిర్‌గామ్‌ చౌపతి తీరంలో దీన్ని ప్రయోగాత్మకంగా నడిపింది. జపాన్‌ సంస్థ సిటౌచీతో కలిసి ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం జరిపినవి రెండో దశ పరీక్షలని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మౌలిక సదుపాయాలు అంతగా అందుబాటులోలేని చిన్నచిన్న నగరాలు, పట్టణాలకు వైమానిక సేవలు చేరువచేయడమే లక్ష్యంగా ఈ విమానాలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. వీటిలో పది నుంచి 14 మంది వరకూ కూర్చొని ప్రయాణించే వీలుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com