నితిన్‌ గడ్కరీ: మెథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి విక్రయించడానికి త్వరలో విధాన నిర్ణయం

- December 11, 2017 , by Maagulf
నితిన్‌ గడ్కరీ: మెథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి విక్రయించడానికి త్వరలో విధాన నిర్ణయం

న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్‌లో 15 శాతం మెథనాల్‌ను కలిపి విక్రయించడానికి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీనివల్ల పెట్రోల్‌ ధర తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన అన్నారు. మెథనాల్‌ను బొగ్గునుంచి తయారు చేస్తారని, అది లీటర్‌ 22 రూపాయిలకే లభ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం లీటర్‌ ధర పెట్రోల్‌ 80 రూపాయిలని, మెథనాల్‌ను కలపడం ద్వారా ధర తగ్గుతుందని, కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com