టీవీ5 చేతికి అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ రైట్స్
- December 12, 2017
పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న అజ్ఞాతవాసి మూవీ ఫై మాములు అంచనాలు లేవు..ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని అంత ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన ఒక్కో స్టిల్ బయటకు వస్తుంటే అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్ర ఆడియో ను ఈ నెల 21 న హెచ్ఐసిసి లో జరపబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఆడియో ఫంక్షన్ కు సంబదించిన రైట్స్ ను ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 5 వారు దక్కించుకున్నారని తెలుస్తుంది. దాదాపు రూ. 85 లక్షలకు ఈ రైట్స్ సొంతం చేసుకున్నారట. పైగా ఇది సోలో లైవ్ ప్రసారం కావడం విశేషం. వాస్తవానికి అజ్ఞాతవాసి శాటిలైట్ హక్కులు జెమిని టీవీ వారు దక్కించుకున్నారు. వారే ఈ ఆడియో ఫంక్షన్ ను కవర్ చేయాలి కానీ వారు కాకుండా టీవీ 5 కి ఆ ఛాన్స్ వెళ్ళింది. మరి చివరికి వారు మాత్రమే లైవ్ చేస్తారా లేక వేరే వారికీ లింక్స్ ఇస్తారా అనేది చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







