' మేడ్ ఇన్ కతర్ ' ఎగ్జిబిషన్ ప్రారంభించిన శ్రీ ఎమిర్
- December 14, 2017
దోహా: స్థానిక దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో ' మేడ్ ఇన్ కతర్ ' ఎగ్జిబిషన్ ఐదవ అధ్యాయాన్ని గురువారం ఉదయం గౌరవనీయ శ్రీశ్రీ ఎమిర్ షేక్ టమిం బిన్ హమద్ అల్-థాని లాంఛనంగా ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా శ్రీశ్రీ ఎమిర్ ఈ ప్రదర్శన మొత్తం తిలకించారు, ఈ సందర్భంగా క్లుప్తంగా మాట్లాడిన ఎమిర్ శ్రీశ్రీ కతర్ ఆర్ధిక వ్యవస్థకు ప్రాజెక్టులు మరియు పరిశ్రమలే ముఖ్యమైన ఆధారమని వాటి పాత్ర సహకారం గురించి వివరించారు. అదేవిధంగా ఆయన వివిధ సంస్థల యొక్క ప్రదర్శనలను..సాంప్రదాయ హస్తకళల యొక్క మంటపాలను సందర్శించారు. శ్రీశ్రీ ఎమిర్ తో పాటు ఆయన ప్రధాని మరియు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్-థానీ మరియు కతర్ చాంబర్ బోర్డు డైరెక్టర్లు మరియు వ్యాపారవేత్తల మంత్రుల సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







