అమెరికాలో లోకేష్ పర్యటన..
- December 14, 2017
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. లోకేశ్ ఆధ్వర్యంలో శాన్ఫ్రాన్సిస్కో లోని గూగుల్ ఎక్స్ కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో ఏపీ ఐటి శాఖ అధికారులు, గూగుల్ ఎక్స్ కంపెనీ సీఈఓ ఆస్ట్రో టెల్లర్ పాల్గొన్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఎక్కడా కార్యకలాపాలు ప్రారంభించని గూగుల్ ఎక్స్.. ఒప్పందం లో భాగంగా ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనుంది. దీంతో.. అది మొదటిసారి ఇండియాలో అడుగు పెడుతున్నట్లవుతుంది. త్వరలోనే విశాఖపట్నంలో గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే.. వేమోగా పిలిచే.. డ్రైవర్ లెస్ కార్, అధునాతన గూగుల్ గ్లాస్సెస్, బేలూన్స్ ఎగరవేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం పొందే.. ప్రొజెక్ట్ లూన్ లాంటి టెక్నాలజీలను గూగుల్ ఎక్స్ అభివృద్ధి చేసింది. ఏపీలో ఏర్పాటు చేయబోయే సెంటర్లో అధునాతన టెక్నాలజీలపై పరిశోధన.. అభివృద్ధి చేయనుంది.
ఫైబర్ గ్రిడ్తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ను గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్తో గ్రామీణ ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్.. అతి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. మొత్తానికి ఏపీకి గూగుల్ ఎక్స్ రాకతో కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







