ఇరాన్‌పై ట్రావెల్‌ బ్యాన్‌: ప్రపోజల్‌పై ఓట్‌ వేయనున్న ఎంపీ

- December 15, 2017 , by Maagulf
ఇరాన్‌పై ట్రావెల్‌ బ్యాన్‌: ప్రపోజల్‌పై ఓట్‌ వేయనున్న ఎంపీ

మనామా: ఇరాన్‌పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించే దిశగా అర్జంట్‌ ప్రపోజల్‌ ఒకటి పార్లమెంటేరియన్స్‌తో టేబుల్‌ చేయబడింది. అరబ్‌ మరియు జిసిసి దేశాల అంతరంగిక విషయాల్లో ఇరాన్‌ అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటేరియన్స్‌ సూచిస్తున్నారు. అయితే షురా కౌన్సిల్‌ మరియు రిప్రెజెంటేటివ్‌ కౌన్సిల్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ ఘానిమ్‌ అల్‌ బుయైనైన్‌ రాతపూర్వకమైన వివరణలో, ట్రావెల్‌ బ్యాన్‌ ఇప్పటికే ఇరాన్‌పై బహ్రెయిన్‌లో ఉందని తెలిపారు. 2016, జనవరి 4న మినిస్టీరియల్‌ రిజల్యూషన్‌ ద్వారా బ్యాన్‌ అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. అయితే ఎంపీల బృందం మాత్రం రోడ్డు, జల మార్గం, వాయు మార్గం ఇలా ఏ మార్గం ద్వారా కూడా ఇరాన్‌తో సంబంధాలు కొనసాగకుండా ఉండేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. టెహ్రాన్‌లో సౌదీ ఎంబసీపై దాడులు, అలాగే మన్షాద్‌లోని కాన్సులేట్‌పై దాడుల నేపథ్యంలో కింగ్‌డమ్‌ నుంచి 48 గంటల్లోగా ఇరానియన్‌ డిప్లమాట్స్‌ వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అల్‌ బుయైనైన్‌ చెప్పారు. మినిస్టర్‌ ఇచ్చిన సమాచారాన్ని గురువారం రివ్యూ చేస్తారు ఎంపీలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com