ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ ఆధ్వర్యంలో 'క్లీన్ అప్ యూఏఈ'
- December 16, 2017
యూఏఈ : పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలు శనివారం ఉదయం ఒక సామూహిక స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. " యూఏఈ ను శుభ్రం చేద్దాం " పేరిట వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా ఈ మహోన్నత సేవా కార్యక్రమాన్ని ఏమిరాటిస్ పర్యావరణ సమూహం ( ఏమిరాటిస్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ ) ద్వారా నిర్వహించబడింది పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలతో పాటు దేవా , ఎం.సి. డోనాల్డ్, అల్ ఘుర్ర్ర్ మరియు మిలీనియం హోటల్ దుబాయ్ మొదలైన సంస్థలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే , పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ సంచులు మరియు సీసాలు మొదలైన వ్యర్ధాలను తొలగించి శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఎడారి దుబాయ్ అలీన్ రహదారి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పరిశుభ్రమైన యూఏఈ కోసం ఉత్సాహంగా జరిగిన ఈ సామాజిక స్వచ్చంద కార్యక్రమంలో ఎడారి నుండి ఎన్నో సేకరించిన వ్యర్థాలు ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులకు పండ్లు నీరు మరియు అల్పాహారం నిర్వాహుకులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







