ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ ఆధ్వర్యంలో 'క్లీన్ అప్ యూఏఈ'
- December 16, 2017
యూఏఈ : పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలు శనివారం ఉదయం ఒక సామూహిక స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. " యూఏఈ ను శుభ్రం చేద్దాం " పేరిట వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా ఈ మహోన్నత సేవా కార్యక్రమాన్ని ఏమిరాటిస్ పర్యావరణ సమూహం ( ఏమిరాటిస్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ ) ద్వారా నిర్వహించబడింది పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలతో పాటు దేవా , ఎం.సి. డోనాల్డ్, అల్ ఘుర్ర్ర్ మరియు మిలీనియం హోటల్ దుబాయ్ మొదలైన సంస్థలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే , పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ సంచులు మరియు సీసాలు మొదలైన వ్యర్ధాలను తొలగించి శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఎడారి దుబాయ్ అలీన్ రహదారి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పరిశుభ్రమైన యూఏఈ కోసం ఉత్సాహంగా జరిగిన ఈ సామాజిక స్వచ్చంద కార్యక్రమంలో ఎడారి నుండి ఎన్నో సేకరించిన వ్యర్థాలు ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులకు పండ్లు నీరు మరియు అల్పాహారం నిర్వాహుకులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







