జీహెచ్ఎంసీకి ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
- December 16, 2017
విద్యుత్ ఆదా.. నిర్వహణ సంస్కరణలను అమలు చేస్తోన్న జీహెచ్ఎంసీ ఎనర్జీ కన్జర్వెషన్ - 2017 అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ గ్రేటర్కు అవార్డును అందజేయనుంది. 2014-15 నుంచి 2016-17 వరకు విద్యుత్ పొదుపు చేసేందుకు జీహెచ్ఎంసీ మెరుగైన విధానాలను అమలులోకి తీసుకువచ్చింది. 32.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపుతో సంస్థకు రూ.23.11 కోట్లు ఆదా అయింది. స్ర్టీట్ లైట్లు వెలగకుండా నిర్ణీత సమయంలో మాత్రమే ఆన్ అయ్యేలా ఆటోమేటిక్ స్విచ్లు ఏర్పాటు ప్రారంభించారు. 25వేల స్విచ్లను ఆన్/ఆఫ్ చేయడానికి కాలనీ సంఘాల సహకారంతో ఎనర్జీ వాలంటీర్లను నియమించారు. చిన్న, చిన్న చౌరస్తాల్లో ఉన్న హై ఓల్టేజీ లైట్ల సామర్ధ్యాన్ని తగ్గించారు. నగరంలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు ప్రాజెక్టు 55 శాతానికి పైగా పూర్తయిందని కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









