ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన శివాజీ...

- May 02, 2015 , by Maagulf
ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన శివాజీ...

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం ఈరోజు గుంటూరులో 10గంటల నుండి నిరాహార దీక్ష చేపడుతున్నట్లు హీరో శివాజీ స్పష్టం చేశారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చివరి వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. ప్రజల కోసమే ఈ పోరాటం చేపడుతున్నానని, ఎవరు మద్దతు ఇచ్చినా... ఇవ్వకపోయినా ఉద్యమం కొనసాగుతుందన్నారు. తనది పోరాటమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. తన పోరాటం అన్ని పార్టీల్లో ఉన్నవారి పిల్లల భవిష్యత్‌ కోసమేనని చెప్పారు. తాను చేసే ఈ దీక్షతో ఎవరికీ ఇబ్బంది ఉండదని, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. తాను దీక్ష చేసే స్థలం నుంచి ఖాళీ చేయిస్తే మరో చోటైనా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. గుంటూరు వదిలి మాత్రం వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చినా తాను సామాజిక కార్యకర్తలానే పనిచేస్తానని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com