తమిళనాడు, కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ...!!
- December 19, 2017
ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించారు. ఓఖీ తుపాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోయిన కన్యాకుమారిని సందర్శించారు. వరద నష్టంపై గవర్నర్, సీఎం పళనీ స్వామి, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓఖీ తుపాను నష్టంపై ప్రధానికి నివేదిక సమర్పించారు ముఖ్యమంత్రి పళనీ స్వామి. 4 వేల కోట్ల రూపాయల సాయం చేయాలని విన్నవించారు. వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రధాని పరిశీలించారు. ఓఖీ తుపాను సమయంలో కన్యాకుమారి చిగురుటాకులా వణికిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. అప్పటి బీభత్సానికి సంబంధించిన ఫోటోలను అధికారులు ప్రదర్శించారు. తమిళనాడుకు కావల్సినంత వరద సాయం చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







