తమిళనాడు, కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ...!!
- December 19, 2017
ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించారు. ఓఖీ తుపాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోయిన కన్యాకుమారిని సందర్శించారు. వరద నష్టంపై గవర్నర్, సీఎం పళనీ స్వామి, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓఖీ తుపాను నష్టంపై ప్రధానికి నివేదిక సమర్పించారు ముఖ్యమంత్రి పళనీ స్వామి. 4 వేల కోట్ల రూపాయల సాయం చేయాలని విన్నవించారు. వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రధాని పరిశీలించారు. ఓఖీ తుపాను సమయంలో కన్యాకుమారి చిగురుటాకులా వణికిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. అప్పటి బీభత్సానికి సంబంధించిన ఫోటోలను అధికారులు ప్రదర్శించారు. తమిళనాడుకు కావల్సినంత వరద సాయం చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







