తమిళనాడు, కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ...!!

- December 19, 2017 , by Maagulf
తమిళనాడు, కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ...!!

ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించారు. ఓఖీ తుపాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోయిన కన్యాకుమారిని సందర్శించారు. వరద నష్టంపై గవర్నర్, సీఎం పళనీ స్వామి, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓఖీ తుపాను నష్టంపై ప్రధానికి నివేదిక సమర్పించారు ముఖ్యమంత్రి పళనీ స్వామి. 4 వేల కోట్ల రూపాయల సాయం చేయాలని విన్నవించారు. వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రధాని పరిశీలించారు. ఓఖీ తుపాను సమయంలో కన్యాకుమారి చిగురుటాకులా వణికిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. అప్పటి బీభత్సానికి సంబంధించిన ఫోటోలను అధికారులు ప్రదర్శించారు. తమిళనాడుకు కావల్సినంత వరద సాయం చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com