టెహ్రాన్కి విమాన సేవల్ని నిలిపివేయనున్న ఎతిహాద్
- December 19, 2017
యు.ఏ.ఈ:ఎతిహాద్ ఎయిర్ వేస్ , టెహ్రాన్కి విమానాల్ని నిలిపివేయనుంది. ఎతిహాద్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2018 జనవరి 24 నుంచి టెహ్రాన్కి విమాన సేవలు నిలిచిపోతాయి. ఇరాన్ రాజధానికి ఎతిహాద్ ప్రస్తుతం నడుపుతున్న ఐదు వీక్లీ విమానాల్ని డిసెంబర్ 25 నుంచి జనవరి 23 వరకు వారానికి రెండు మాత్రమే నడపాలని, జనవరి 24 తర్వాత పూర్తిగా సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఎతిహాద్ ఎయిర్లైన్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఈ రూట్ ఎందుకు సస్పెండ్ చేస్తున్నారన్న విషయమ్మీద మాత్రం అధికార ప్రతినిథి స్పందించలేదు. స్ట్రేటజీ రివ్యూలో భాగంగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం శాన్ఫ్రాన్సిస్కో, డల్లాస్ - ఫోర్ట్కి కూడా విమాన సర్వీసుల్ని తగ్గించనుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కలిగే అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆయా రూట్లలో ప్రయాణాల్ని రీ-బుక్ చేసుకోవడం లేదా చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఎతిహాద్ ఎయిర్లైన్స్. జనవరి 24 తర్వాత ప్రయాణాలకు మాత్రం పూర్తిగా రిఫండ్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







