అబుదాబీ లో ట్రాఫిక్ రద్దీ సమయంలో భారీ వాహనాలు మరియు ట్రక్కులు నిషేధం
- December 21, 2017
అబుదాబి : వచ్చే నూతన సంవత్సరం జనవరి నుంచి అబుదాబీ లోనికి ట్రాఫిక్ రద్దీ సమయంలో రహదారులపై భారీ వాహనాలు, ట్రక్కులను అనుమతించరు. రవాణా శాఖ సహకారంతో అబుదాబి పోలీసులు మృదువైన ట్రాఫిక్ ప్రవాహాన్నిఅందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం అమలుచేయనున్నారు. రోడ్లు సురక్షితమైనవి కావడంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుండి ఉదయం 9 గంటల సమయంలో రాత్రి మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యకాలంలో నగరం మరియు పట్టణ శివారు ప్రాంతాలలో ప్రవేశించకుండా హైవే పై వాహనాలు మరియు ట్రక్కులు నిషేధించబడ్డాయి. ఈ నిబంధనను అతిక్రమించి పొరబాటున ఆయా భారీ వాహనాలు, ట్రక్కులు అనుక ప్రవేశిస్తే, ప్రవేశంపై సూచనలు ఇస్తూ నగరం యొక్క ప్రధాన రహదారులపై మరియు శివార్లలో రోడ్లపై రహదారి చిహ్నాలు ఉంచబడ్డాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిబంధనలను పట్టించుకోకుండా నిషేధిత రహదారులలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, 1,000 దిర్హామ్లతో పాటు నాలుగు నలుపు చుక్కలను డ్రైవింగ్ లైసెన్స్ పై ముద్రిస్తారని ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు రహదారి భద్రత డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ ఆల్ షెహహి చెప్పారు. రహదారిపై ట్రాఫిక్ రద్దీని మరియు ప్రమాదాలు తగ్గించడానికి మరియు రహదారి భద్రత మెరుగుపరచడానికి అబుదాబి యొక్క భూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు డైరెక్టరేట్ యొక్క వ్యూహాత్మక ప్రణాళికలో ఈ చర్యలు అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!







