అబుదాబీ లో ట్రాఫిక్ రద్దీ సమయంలో భారీ వాహనాలు మరియు ట్రక్కులు నిషేధం
- December 21, 2017
అబుదాబి : వచ్చే నూతన సంవత్సరం జనవరి నుంచి అబుదాబీ లోనికి ట్రాఫిక్ రద్దీ సమయంలో రహదారులపై భారీ వాహనాలు, ట్రక్కులను అనుమతించరు. రవాణా శాఖ సహకారంతో అబుదాబి పోలీసులు మృదువైన ట్రాఫిక్ ప్రవాహాన్నిఅందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం అమలుచేయనున్నారు. రోడ్లు సురక్షితమైనవి కావడంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుండి ఉదయం 9 గంటల సమయంలో రాత్రి మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యకాలంలో నగరం మరియు పట్టణ శివారు ప్రాంతాలలో ప్రవేశించకుండా హైవే పై వాహనాలు మరియు ట్రక్కులు నిషేధించబడ్డాయి. ఈ నిబంధనను అతిక్రమించి పొరబాటున ఆయా భారీ వాహనాలు, ట్రక్కులు అనుక ప్రవేశిస్తే, ప్రవేశంపై సూచనలు ఇస్తూ నగరం యొక్క ప్రధాన రహదారులపై మరియు శివార్లలో రోడ్లపై రహదారి చిహ్నాలు ఉంచబడ్డాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిబంధనలను పట్టించుకోకుండా నిషేధిత రహదారులలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, 1,000 దిర్హామ్లతో పాటు నాలుగు నలుపు చుక్కలను డ్రైవింగ్ లైసెన్స్ పై ముద్రిస్తారని ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు రహదారి భద్రత డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ ఆల్ షెహహి చెప్పారు. రహదారిపై ట్రాఫిక్ రద్దీని మరియు ప్రమాదాలు తగ్గించడానికి మరియు రహదారి భద్రత మెరుగుపరచడానికి అబుదాబి యొక్క భూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు డైరెక్టరేట్ యొక్క వ్యూహాత్మక ప్రణాళికలో ఈ చర్యలు అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







