స్వచ్ఛభారత్కు రూ.666కోట్ల విరాళాలు.!
- December 21, 2017
కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ సాకారం కోసం ప్రముఖుల నుంచి సామాన్యపౌరుల వరకు తమ వంతు కృషి చేస్తున్నారు. మరికొందరు విరాళాలు అందిస్తూ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. అలా 2014లో స్వచ్ఛభారత్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు స్వచ్ఛభారత్ ఖజానాకు రూ. 666కోట్లకు పైనే విరాళాల రూపంలో అందాయట. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గురువారం లోక్సభకు వెల్లడించింది. స్వచ్ఛభారత్ మిషన్ కోసం ప్రజల నుంచి అందిన విరాళాలపై కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయమంత్రి రమేశ్ చండప్ప లోక్సభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. '2014-15లో ప్రభుత్వానికి రూ. 159కోట్ల విరాళాలు అందాయి. 2015-16 సంవత్సరంలో రూ. 253కోట్లు, ఆ తర్వాత 2016-17 సంవత్సరంలో రూ. 245కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇక 2017-18లో ఇప్పటివరకు రూ.8కోట్లు విరాళాలుగా అందాయి' అని రమేశ్ తెలిపారు. ఇందులో రూ. 633.98కోట్లను ఇప్పటికే స్వచ్ఛభారత్ మిషన్ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







