స్వచ్ఛభారత్కు రూ.666కోట్ల విరాళాలు.!
- December 21, 2017
కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ సాకారం కోసం ప్రముఖుల నుంచి సామాన్యపౌరుల వరకు తమ వంతు కృషి చేస్తున్నారు. మరికొందరు విరాళాలు అందిస్తూ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. అలా 2014లో స్వచ్ఛభారత్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు స్వచ్ఛభారత్ ఖజానాకు రూ. 666కోట్లకు పైనే విరాళాల రూపంలో అందాయట. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గురువారం లోక్సభకు వెల్లడించింది. స్వచ్ఛభారత్ మిషన్ కోసం ప్రజల నుంచి అందిన విరాళాలపై కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయమంత్రి రమేశ్ చండప్ప లోక్సభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. '2014-15లో ప్రభుత్వానికి రూ. 159కోట్ల విరాళాలు అందాయి. 2015-16 సంవత్సరంలో రూ. 253కోట్లు, ఆ తర్వాత 2016-17 సంవత్సరంలో రూ. 245కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇక 2017-18లో ఇప్పటివరకు రూ.8కోట్లు విరాళాలుగా అందాయి' అని రమేశ్ తెలిపారు. ఇందులో రూ. 633.98కోట్లను ఇప్పటికే స్వచ్ఛభారత్ మిషన్ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







