స్వచ్ఛభారత్‌కు రూ.666కోట్ల విరాళాలు.!

- December 21, 2017 , by Maagulf
స్వచ్ఛభారత్‌కు రూ.666కోట్ల విరాళాలు.!

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ సాకారం కోసం ప్రముఖుల నుంచి సామాన్యపౌరుల వరకు తమ వంతు కృషి చేస్తున్నారు. మరికొందరు విరాళాలు అందిస్తూ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. అలా 2014లో స్వచ్ఛభారత్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు స్వచ్ఛభారత్‌ ఖజానాకు రూ. 666కోట్లకు పైనే విరాళాల రూపంలో అందాయట. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గురువారం లోక్‌సభకు వెల్లడించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కోసం ప్రజల నుంచి అందిన విరాళాలపై కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయమంత్రి రమేశ్‌ చండప్ప లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. '2014-15లో ప్రభుత్వానికి రూ. 159కోట్ల విరాళాలు అందాయి. 2015-16 సంవత్సరంలో రూ. 253కోట్లు, ఆ తర్వాత 2016-17 సంవత్సరంలో రూ. 245కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇక 2017-18లో ఇప్పటివరకు రూ.8కోట్లు విరాళాలుగా అందాయి' అని రమేశ్‌ తెలిపారు. ఇందులో రూ. 633.98కోట్లను ఇప్పటికే స్వచ్ఛభారత్‌ మిషన్‌ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com