విజయవాడలో ప్రారంభమైన కువైట్ కంపెనీ ఆల్హానా
- December 21, 2017
విజయవాడ: కువైట్లో 1984లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆల్హానా యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో తమ కార్యకలాపాలను విస్తృత పరచుకునేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆ సంస్థ కువైట్ చైర్మన్ అలీఅల్లా రాధీ, ఇండియా చైర్మన్ పల్లెం ఏసురత్నం కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో చైర్మన్ మాట్లాడుతూ కువైట్లో ప్రప్రథమంగా సివిల్ నిర్మాణాలతో ప్రారంభమైన కంపెనీ నేడు దాదాపు 2700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. అందులో వెయ్యి మంది ఇండియాకు చెందిన వారే ఉన్నారన్నారు. ఆకివీడుకు చెందిన ఏసురత్నం ప్రస్తుతం ఇండియా తరపున చైర్మన్గా ఉండడం కంపెనీకి మరింత గర్వకారణమన్నారు. ఈ సదస్సులో చైర్మన్ ఏసురత్నం, కంపెనీ ప్రతినిధి శ్యాంసన్ పొట్లా, కోనేరు కన్స్ట్రక్చన్స్ కంపెనీ చైర్మన్ విశ్వనాథం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







