విజయవాడలో ప్రారంభమైన కువైట్ కంపెనీ ఆల్హానా
- December 21, 2017
విజయవాడ: కువైట్లో 1984లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆల్హానా యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో తమ కార్యకలాపాలను విస్తృత పరచుకునేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆ సంస్థ కువైట్ చైర్మన్ అలీఅల్లా రాధీ, ఇండియా చైర్మన్ పల్లెం ఏసురత్నం కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో చైర్మన్ మాట్లాడుతూ కువైట్లో ప్రప్రథమంగా సివిల్ నిర్మాణాలతో ప్రారంభమైన కంపెనీ నేడు దాదాపు 2700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. అందులో వెయ్యి మంది ఇండియాకు చెందిన వారే ఉన్నారన్నారు. ఆకివీడుకు చెందిన ఏసురత్నం ప్రస్తుతం ఇండియా తరపున చైర్మన్గా ఉండడం కంపెనీకి మరింత గర్వకారణమన్నారు. ఈ సదస్సులో చైర్మన్ ఏసురత్నం, కంపెనీ ప్రతినిధి శ్యాంసన్ పొట్లా, కోనేరు కన్స్ట్రక్చన్స్ కంపెనీ చైర్మన్ విశ్వనాథం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







