విజయవాడలో ప్రారంభమైన కువైట్ కంపెనీ ఆల్హానా
- December 21, 2017
విజయవాడ: కువైట్లో 1984లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆల్హానా యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో తమ కార్యకలాపాలను విస్తృత పరచుకునేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆ సంస్థ కువైట్ చైర్మన్ అలీఅల్లా రాధీ, ఇండియా చైర్మన్ పల్లెం ఏసురత్నం కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో చైర్మన్ మాట్లాడుతూ కువైట్లో ప్రప్రథమంగా సివిల్ నిర్మాణాలతో ప్రారంభమైన కంపెనీ నేడు దాదాపు 2700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. అందులో వెయ్యి మంది ఇండియాకు చెందిన వారే ఉన్నారన్నారు. ఆకివీడుకు చెందిన ఏసురత్నం ప్రస్తుతం ఇండియా తరపున చైర్మన్గా ఉండడం కంపెనీకి మరింత గర్వకారణమన్నారు. ఈ సదస్సులో చైర్మన్ ఏసురత్నం, కంపెనీ ప్రతినిధి శ్యాంసన్ పొట్లా, కోనేరు కన్స్ట్రక్చన్స్ కంపెనీ చైర్మన్ విశ్వనాథం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక