క్రైస్తవుల విద్య, ఉపాధికి అధిక ప్రాధాన్యం: బాబు
- December 25, 2017
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు విజయవాడ: రాష్ట్రంలో క్రైస్తవుల విద్య, ఉపాధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విజయవాడలోని సెయింట్పాల్ కేథడ్రల్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. చర్చి బిషప్ జోసెఫ్ రాజారావు, ఇతర పాస్టర్లు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. తెలుగు ప్రజలకు, క్రైస్తవులకు ప్రభుత్వం తరపున చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏసుక్రీస్తు ఆశీర్వాదం అందజేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, తమ జీవితాన్ని సేవ కోసం అంకింతం చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి